UPDATES  

 తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్
ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
కార్యకర్తలు భారీ ర్యాలీ, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం. బస్టాండ్ సెంటర్లో అన్నదానం
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత స్థానిక పాతి డిపో నుంచి బస్టాండ్ సెంటర్ వరకు కార్యకర్తలు యువకులు ద్విచక్ర వాహనంతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటుచేసిన సభ ప్రాంగణానికి తరలివచ్చారు. కార్యకర్తలు అభిమానుల మధ్య ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కెసిఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని యువకులు స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ్ కి నేత కేసిఆర్ అని తెలంగాణ జాతిపితగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలుచు కుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపిస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామంగా నిలపడమే కాకుండా దేశ రాజకీయాలను స్వాగతిస్తూ బీఆర్ఎస్ గా ఏర్పాటై భారతదేశంలోని ఒక సముచితమైన స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర వాడిని వేడిని చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అన్నారు. ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకొని ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు ఎంపీపీలు భూక్య సోనా, భధావత్ శాంతి, ఉర్దూగర్ చైర్మన్ ఎస్కే అన్వర్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ బ రాంబాబు, నాయకులు పరంజ్యోతి రావు, కాసుల వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !