UPDATES  

 ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి…. – మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సీసీ రేగా రవి.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 17: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సీసీ రేగా రవి అన్నారు. ఆయన శుక్రవారం రేగా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా భద్రాచలం జాగృతి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణం నిలబడడంతో పాటు కుటుంబాన్ని కాపాడిన వారవుతారన్నారు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ రేగా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో రక్త దానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆయన కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !