మన్యం న్యూస్, సారపాక ఫిబ్రవరి 16..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో పొంగులేటి, పాయం నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనదే విజయం అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఉన్న మీ అభిమానం నన్ను వీడి పోలేదని నా వెంటే ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజ్జం వెంకటేశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.