UPDATES  

 బాధిత కుటుంబాలకు అండగా ఉంటా….. అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి16: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, బిఆర్ఎస్ కార్యకర్తలకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశాడు. గురువారం బిఆర్ఎస్ నాయకుడు సూర వెంకటేశ్వరరావు తండ్రి సూర క్రిష్ణయ్య(75) మృతి చెందటంతో కుటుంబ సభ్యులను పరామర్శించి, క్రిష్ణయ్యకు నివాలర్పించారు. అనారోగ్యంతో చికిత్సపొంది ఇంటి వద్ద ఉన్న జెడ్పీటీసీ వెంకటరెడ్డిని పరామర్శించి, జిల్లా బిఆర్ఎస్ నాయకుడు సారేపల్లి శేఖర్ ను ఓదార్చారు. ఆయన సతీమణి సారేపల్లి నాగశిరోమణి(53)మృతికి పట్ల విచారం వ్యక్తం చేశారు. అండగా ఉంటానని భరోసాను కల్పించాడు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు (దారా బాబు) ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ సీనియర్ మేడా మోహన్ రావు, బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, ఉన్నం నాగరాజు, చీదెళ్ల పవన్ కుమార్, కార్యకర్తలు,తదితరులుపాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !