మన్యం న్యూస్ మంగపేట, ఫిబ్రవరి 16
మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమణక్కపేట మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకి నాగశ్రీను కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. గురువారం దశ దిన కర్మలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై నాగ శ్రీను గారికి ఘన నివాళ్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో రమణక్కపేట సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, రాజుపేట గ్రామ యూత్ అధ్యక్షులు కరకాపల్లి సంబమూర్తి, సీనియర్ నాయకులు పైయ్యావుల బాబురావు, బోనుగు సుబ్బారావు, వీర్ల రఘు,పందుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
