మన్యం న్యూస్, మంగపేట. ఫిబ్రవరి 16
ముచ్చెర్ల నాగారం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం ఉపాధ్యాయురాలు కుంజ జయమ్మ మృతి చెందగా ఆ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ వారి స్వగృహమైన తాడ్వాయి మండలం వీరపూర్ గ్రామంలో గురువారం వెళ్లి కుంజ జయమ్మ (టీచర్ )మృత దేహానికి పూలమాల వేసి నివాళర్పిoచి వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో. బిరెల్లి సర్పంచ్ జజా చంద్రం,తాడ్వాయి మాజీ మండల పార్టీ అధ్యక్షులు రమేష్, తాడ్వాయి మండల మహిళా అధ్యక్షురాలు సోమ నాగక్క ,మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య, మండల ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మంగపేట తోలేం నర్సింహారావు , పూలాసం పూరషోత్తం, కిరణ్, , మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు ఉన్నారు.
