ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కలిసి మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన… తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16… హైదరాబాదులో: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డిని, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం విద్యా ఉపాధ్యాయుల పదోన్నతులు గురించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున తను అన్నివేళలా కృషి చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది…
ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బి రాఘవరెడ్డి, పి కృష్ణమూర్తి గౌడ్, సుబ్రహ్మణ్యం, పోలేబోయిన అనిల్ కుమార్, దినేష్ కుమార్ గౌడ్, విద్యా ఉపాధ్యాయుల కిషోర్ కుమార్, డాక్టర్ బి రాఘవరెడ్డి, పి కృష్ణమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు…
