మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 16: ప్రోటోకాల్ పాటించని అధికారులను ఇక ఉపేక్షించేదిలేదని, ప్రతి పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులను లోకల్ సర్పంచ్, ఎంపిటీసీలతో పాటు తనకు కూడా సమాచారం అందించాలని ఎంపీపీ
బాణోత్ పార్వతి మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని గత మాడు నెలల అభివృద్ది, ప్రగతి నివేదికలపై శాఖల వారీగా సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా రావికంపాడులో క్రీడా ప్రాంగణం ప్రారంభించటంలో ప్రోటోకాల్ పాటించలేదని ఏపీఓ రాంచందర్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ఏఈ శ్రీనివాస్ రావును సైతం మందలించారు. కోట్లాది రూపాయాల సిసిరోడ్లు ప్రభుత్వం మంజూరి చేస్తుంటే కనీసం ఎంపీపీకి సమాచారం ఇవ్వారా? అంటూ ఆగ్రహించారు. ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హమీ ఇచ్చారు. సమీక్ష సమావేశానికి రాని అధికారులకు నోటీసులు ఇస్తామని
ఎంపిడిఓ అన్నపూర్ణ సభ్యులకు హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిడీఓ అన్నపూర్ణ, కొత్తగూడెం వ్యవసాయశాఖ మార్కెట్ కమిటి చైర్మన్ భూక్య రాంబాబు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, ఎంపీటీసీలు లంకా విజయలక్ష్మి, బొర్రా లలిత, భూక్య, రాజీ, సర్పంచ్లు బానోత్ రన్య, కీసరి శాంతమ్మ, వాసం శివలలితజ్యోతి, వివిధశాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
