మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం. ఫిబ్రవరి 16
. వెంకటాపురం మండల కేంద్రంలో కె.వి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సమ్మక్క సారక్క క్రికెట్ టోర్నమెంట్ ను వెంకటాపురం మండలం జడ్పిటిసి పాయం రమణ గురువారం రిబ్బన్ కట్ చేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. శ్రీ సమ్మక్క సారక్క క్రికెట్ టోర్నమెంట్ కు బహుమతులు అందజేసేదాత కోర్స వెంకటేశ్వరరావు ( కె.వి ). మొదటి బహుమతి 20,116 , షీల్డ్, రెండవ బహుమతి 15,116 షీల్డ్, మూడవ బహుమతి10,116 షిల్డ్, ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి పాయం రమణ మాట్లాడుతూ క్రీడాకారులకు కీడాభిమానులకు తమ ప్రతిభను కనబరిచి ఈ పోటీలను జయప్రదం చేయాలని కోరారు. ఆటలాడటం వల్ల మానసిక, శారీరక ఒత్తిడిలో నుంచి కొత్త ఉత్తేజంతో ఉంటారని. తద్వారా అందరికీ క్రీడల వల్ల ఆలోచన శక్తి మెరుగుపడుతుందని వారు తెలిపారు.
మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన క్రీడాకారులు వారి వారి ప్రతిభను చాటాలని . గొప్పగా ఆడి ఎత్తైన శిఖరాలను అందుకోవాలని. ఈ ఆటలు ఆట కోసమే కాక మానసిక ఆలోచన విధానాన్ని మెరుగు పరచుకోవటానికి కూడా ఉపయోగ పడతాయని వారు అభిప్రాయపడ్డారు. టోర్నమెంటు ఉద్దేశం గ్రామాలలో ఉన్న యువతను ప్రోత్సహించి వారి ప్రతిభను వెలుగులోకి తీయడానికి ఇదొక సదవకాశంగా భావించి యువత ముందుకు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడ నిర్వాహన చైర్మన్ పసుల సూర్యనారాయణ. వైస్ చైర్మన్ పర్షిక సతీష్, సిద్ధిబోయిన భుజంగరావు, టింగ బుచ్చయ్య, గొంది హనుమంతు, తుర్స చంటి గొంది కామేష్, తుర్స కృష్ణబాబు, కంతి నేత్రానందు తాటి రాంబాబు,లోడిగ నరసింహారావు,యర్రం రాధాకృష్ణ పెండకట్ల రమేష్ మడత సతీష్ కుర్సం శంకర్ గోంది బాలు, తదితరులు పాల్గొన్నారు.
