మన్యం న్యూస్ గుండాల. ఫిబ్రవరి 16
ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలో ఉన్న కూరగాయల తోటల వద్దకు వెళ్లి కొద్దిసేపు ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. స్వయంగా తానే కూరగాయల తోటలోకి వెళ్లి కూరగాయలను సేకరించారు. ఎటువంటి పురుగు మందులు వేయకుండా పండించిన కూరగాయలు తినడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉండవచ్చని ఆమె అన్నారు.
