మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి,ఫిబ్రవరి 16 :అశ్వారావుపేట నియోజకవర్గంలో పోంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన అభ్యర్ధి జారే ఆదినారాయణ అన్నపురెడ్డిపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు.మండల పరిధిలోని మర్రిగుడెం గ్రామ పంచాయతీలోని రామకృష్ణపూరం గ్రామంలో జడ లక్ష్మి దశ దిన కార్యానికి హాజరైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పర్సా వెంకట్,వీరబోయిన నాగేశ్వరరావు,కోండ్రు రత్నంబాబు,లాలు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
