UPDATES  

 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధం ..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 20
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండల పరిధి కొత్తూరు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే కొత్తూరు గ్రామానికి చెందిన కురుసం కృష్ణమూర్తి అనే ఆదివాసి గిరిజన రైతుకు చెందిన ఇంట్లో సోమవారం రాత్రి ప్రాంతంలో ఇంటిలో అమర్చి ఉన్న విద్యుత్ మీటర్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీన్ని గమనించిన కుటుంబీకులు బయటకు పరుగులు తీసి చుట్టుపక్కల వారికి తెలియజేయగా అప్పటికే మంటలు క్షణాలలో ఇల్లంతా చుట్టుముట్టాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు తీసి మంటలను ఇతర ఇళ్లకు వ్యాపించకుండా ఆర్పే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా వ్యాపించిన మంటలతో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇటీవలే అమ్మడానికి సిద్ధంగా ఉంచిన ప్రతి , దుస్తులు పట్టేదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డులు వడ్లు బియ్యం మరో రెండు రోజుల్లో గ్రామంలో జరిగే తమ సమీప బంధువుల వివాహం కోసం దాచి ఉంచిన నగదు వంట పాత్రలు దగ్ధం అయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలు గ్రామంలో ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి సుమారుగా లక్ష రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !