మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి20: శ్రీమంత్ రెడ్డి ఎడ్యుకేషనల్అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక సహాయం అందజేశారు. మణుగూరు మండలంలోని అశోక్ నగర్ గ్రామానికి చెందిన తగరపూడి వెంకటరమణ, శ్రీలత దంపతుల కుమారుడు అవనీష్ తేజ్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకొని శ్రీమంత్ రెడ్డి ఎడ్యుకేషనల్అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 3000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికొమ్ము వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్, రమణ కుమార్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
