మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 20 …అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఏఐసీసీ నెంబర్ గా భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య ఎన్నిక పట్ల మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు.అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వనమా గాంధీ భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.
