మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 20.. బాల కార్మికుల హక్కులను కాలరాయ వద్దని చిన్నపిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హరీష్ హెచ్చరించారు సోమవారం
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో డి సి పి ఓ ఓంకార్ ఆధ్వర్యంలో బాల కార్మికులపై ప్రత్యేక అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్సై హరీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వాజేడు మండలంలో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి దినసరి కూలీలను ప్రధానంగా మిర్చి వ్యవసాయ పనులు కొరకు తీసుకొస్తున్నారు. వచ్చిన లేబర్ బాల బాలికల వయసు 14 సంవత్సరాలకు తక్కువ ఉండకూడదని, మైనర్ బాల బాలికలను పనులకు తీసుకురాకూడదని రైతులకు తెలియజేశారు. మైనర్ పిల్లలు పనిలో కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయని, మైనర్ పిల్లలను పనిలో పెట్టకుండా రైతులు బాల కార్మికుల హక్కులను రక్షించేందుకు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరస్వతి, సెక్రటరీ రమేష్, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
