UPDATES  

 నూతన రేషన్ కార్డులు మంజూరీ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం..

 

మన్యం న్యూస్: జూలూరుపాడు,ఫిబ్రవరి 20,అర్హులైన నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు మంజూరీ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కి సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా
ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పగడాల అఖిల్,ఎస్కే చాంద్ పాషాలు మాట్లాడుతూ.. దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారని,వీరంతా కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని,వీరిలో అర్హులను గుర్తించి నూతన కార్డుల మంజూరి చేయాలని తహశీల్దార్ ఆర్ శారద ను కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు నరేష్,గంజి మధు,వీరస్వామి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !