మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 20
ఒక గ్రామంలొ ఒకే గిరిజన ఇసుక సోసైటీ ఉండాలని మంగపేట మండలం రమణక్క పేటకు చెందిన కొమరం భీమ్ ఎస్టి ఇసుక క్వారీ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్ సభ్యులు సోమవారం ములుగు డిసిఓకు వినతి పత్రం అందజే శారు.టిసిఎస్ యాక్ట్ 1964 ప్రకారం కొమరం బీమ్ ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం యాక్టివ్ ఉందని పాత సొసైటీని పరిగణలోకి తీసుకొని కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఒక్క గ్రామంలొ ఒక్కటే సంఘం ఉండాలని, ఆ సంఘంలొ అందరం ఉంటామని తీర్మానం చేసుకున్నట్లు శ్రీ శ్రీ ఎర్రమ్మ తల్లి గిరిజన మహిళా ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం నందు ఉండమని కొమరం భీమ్ సంఘం నందు కొనసాగుతమని అన్ని అనుమతులు పాత సంఘానికి ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలొ కే.శంకర్, నాగమణి,సుధా, రమాదేవి,జగదీష్,సుకన్య,పద్మ,నాగలక్ష్మి,మినా,సారమ్మా,నాగమణి,లలిత,సావిత్రి,వసంత్,భవాని,స్వప్న,సరిత,నాగమ్మ,రోషమ్మ,పాల్గొన్నారు.
