క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలు
ఆరోగ్య పరిపుష్టికి దోహదపడుతాయి…
-పోటీతత్వము మనలోని ప్రతిభకు పదును పెడుతుంది.
-మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ రాంచందర్.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి20:
పోటితత్వము మనలోని ప్రతిభకు పదును పెడుతుందని ఏరియా జనరల్ మేనేజర్ రామచంద్ర అన్నారు. ఆయన సోమవారం మణుగూరు ఏరియా పివీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి సింగరేణి పాఠశాల విద్యార్ధులకు నిర్వహించిన అథ్లెటిక్స్ మీట్ క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. భద్రాద్రి స్టేడియం నందు అనేక కంపెనీ స్థాయి, కోలిండియా స్థాయి పోటీలను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం ప్రత్యేక నిధులు కేటాయించి కంపెనీ స్థాయిలో సింగరేణి పాఠశాల అథ్లెటిక్స్ మీట్ కు మన మణుగూరు ఏరియాను ఎన్నుకోవడం జరిగిందన్నారు. వారి నమ్మకానికి తగ్గట్టే అన్నీ ఏరియా ల నుంచి వచ్చే బాల క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కటి ప్లానింగ్ తో సకల సౌకర్యాలు కలిపించిన అథ్లెటిక్స్ మీట్ నిర్వహణ కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు ఆరోగ్య పరిపుష్టికి దోహదపడుతాయన్నారు. రేపటి భావి భారత పౌరులైన విద్యార్ధులు విద్యా, శాస్త్ర, సాంకేతిక క్రీడా రంగాలలో విజయవంతంగా అగ్రస్థానానికి చేరుకోవాలంటే నిరంతర సాదన ఒక్కటే సరిపోదని, పోటీతత్వము మనలోని ప్రతిభకు పదును ఏర్పడుతుందన్నారు. ఎక్కడ అవకాశం ఉన్న ఆయా విభాగాల పోటీలలో చురుకుగా పాల్గొంటూ ఉండాలన్నారు. తద్వారా గెలుపుకు కావలసిన మెళుకువలు, ఓటమి నుండి తప్పించుకొనే కిటుకులు తెలుసుకొని సమయస్పూర్తి తో ఆడుతూ ఎప్పటికీ విజేతగా నిలువవచ్చన్నారు. ఈ అథ్లెటిక్స్ మీట్ లో సింగరేణి లోని 38 ఏరియాల నుంచి సుమారుగా 220 క్రీడాకారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో వెంకటేశ్వర్లు, యస్. రమేశ్, శ్రీనివాస రావు, వెంకటరమణ, గుర్తింపు సంఘం ప్రతినిధి డి వీరభద్రం, డాక్టర్ శేషగిరి, జే శ్రీనివాస రావు, వి. రామేశ్వర రావు, సింగు శ్రీనివాస్, పిబి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
