మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 20 … కరకగూడెం మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ సోమవారం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని డి. ఎఫ్ డబ్ల్యూ పనుల ద్వారా రైతులకు పంట కాలువలు ఇంకుడు గుంటలు వంటివి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని, గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి ఆధార్ స్వచ్ఛంద సంస్థ తమ వంతుగా చేతగా రేషన్ కిట్స్ ఇస్తామని తెలపడం జరిగింది.అలాగే పురాతన ఆదివాసి వంటకాలను వెలుగులోకి తీసుకురావడం కోసం వంటకాల పండుగా ( ఫుడ్ ఫెస్టివల్) వంటివి కార్యక్రమాలు గ్రామాలలో వెలుగులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆధార్ స్వచ్చంద సంస్థ సభ్యులు బట్టా.బిక్షపతి,ఊకే.గణేష్, పూనెం.విష్ణు,గ్రామస్తుల సూతరి.నాగేశ్వరరావు,ఎల్లబోయిన.సత్యం,మల్కం.పుల్లయ్య, కుమార్ స్వామి, వృద్ధులు పాల్గొన్నారు.
