UPDATES  

 చెప్పండమ్మా.. ఏం సమస్య ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే హరిప్రియ పర్యటన ప్రజల వద్ద నుంచి వినతుల స్వీకరణ

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి20.. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లోని సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్  నడుంకట్టారు. సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా 3 వ వార్డు నుంచి మొదలుకొని 9 వ వార్డు వరకు  పర్యటించి ప్రజాసమస్యలు ఓపికగా తెలుసుకొన్నారు. సమస్యలకు సంబందించిన అభ్యర్దనా పత్రాలను ప్రజలవద్దనుంచి  తీసుకున్నారు. కొత్తగూడెం పర్యటనలో సీఎం కెసిఆర్ ప్రకటించిన, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తున్న నిధుల కేటాయింపులు సమస్యాత్మక వార్డులకు కేటాయించాలని, సమగ్రంగా వార్డుల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే దృష్టి సారించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటీ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్,వార్డు కౌన్సిలర్స్ ,పుర ప్రజల పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !