మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 20
మండల పరిధిలోని పోట్లపల్లి పంచాయితీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందత్వ నివారణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ సోమవారం నాడు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా ఇప్పటికే చాలా గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయిందని, ఈ కార్యక్రమం ద్వారా చాలామంది కంటి చూపును పొందారని, అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. నేటి వరకు మొత్తం 22 శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ దుర్గాభవాని, డాక్టర్ దినేష్ కుమార్, ఆప్తమాలజిస్ట్ సంజీవరావు, ఏఎన్ఎంలు భారతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
