UPDATES  

 మంగపేట మండలం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎన్నిక

మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 20
మంగపేట మండలం రాజుపేట రైతు వేదిక లో వర్కింగ్ జర్నలిస్ట్ ల యూనియన్ అత్యవసర సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ ల సంక్షేమం, జర్నలిస్ట్ ల ఐక్యత, హెల్త్ కార్డులు,భవిష్యత్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, విధివిధానాలు,జర్నలిస్ట్ లపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భౌతిక దాడుల గురించి చర్చించారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ ల వర్కింగ్ యూనియన్ ఎన్నుకోవడం జరిగింది.మండల అధ్యక్షులుగా ఈసం పల్లి సురేందర్, ఉపాధ్యక్షులుగా జాన పట్ల జయరాజు, ప్రధాన కార్యదర్శిగా అజరుద్దీన్, కార్యదర్శి గా చెట్టుపల్లి స్నేహ కుమార్, గౌరవ అధ్యక్షులు గా కటుకురి సాంబశివరావు,వికే చారి,మైపా శంకర్,గౌరవ సభ్యులు గా ఎర్ర శ్రవణ్, గాజుల పవన్ బొడ ప్రవీణ్ పోలసాని శ్రీనివాస్ రెడ్డి, ఉగ్గమల్ల గణేష్ ఎన్నిక అయ్యారు.ఈ సందర్బంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరుతున్న భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా మని అన్నారు.అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి డబుమ్ బెడ్ రూమ్ కట్టి ఇవ్వాలని,హెల్త్ కార్డులు ఇవ్వాలని, నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తు, నిత్యం వార్తలు సేకరిస్తూ ప్రజా క్షేత్రం లో ఉండి కరోనా సమయంలొ సైతం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసిన జర్నలిస్ట్ లకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలొ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !