UPDATES  

 ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి19: ఇల్లందు జగదాంబ సెంటర్ నందు హిందూ జాతీయవాద సంస్థలు విశ్వహిందూ పరిషత్,భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ , ధర్మజాగరణ అధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త పెండేకట్ల యకయ్య దొర, విహెచ్పీ వోరుగంటి సురేష్, గడదేశి వెంకటేశ్వర్లు పాల్గొని శివాజీ విగ్రహాన్ని పూల మాలతో అలంకరించారు.ఇల్లందు ప్రధాన మార్గం లో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు రాములోనియ మాట్లాడుతూ దేశంలోని ప్రతి యువకుడికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శంగా నిలుస్తారన్నారు.శత్రువుల కుటుంబాలకు చెందిన ఆడవారిని తల్లిలా చూసిన గొప్ప దార్శనికుడు శివాజీ అని గుర్తుచేశారు. 17 వ శతాబ్దంలో దేశం మొత్తం విదేశీ మొగలుల భానిసత్వంలో మగ్గుతున్న హైందవ జాతిని మేల్కొలిపి , స్వాభిమానాన్ని రగిల్చిన కారణ జన్ముడు ఛత్రపతి శివాజీ అన్నారు.కార్యక్రమంలో బైరోజు వెంకటేశ్వర్లు, జెపి, రజత్ రాజేశ్వరరావు, బాలకిషన్,గోపి,కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !