మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 19, మండల పరిధిలోని వెంగన్నపాలెం, గుండెపుడి గ్రామాలకు చెందిన పలువురు ప్రముఖ వ్యక్తులు ఇటీవల అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లు ఆదివారం పరామర్శించారు. గుండె పుడి గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ గాదే నిర్మల కుటుంబాన్ని, కాళ్ళూరి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని, గాదే సురేష్ కుటుంబాన్ని, వెంగన్నపాలెం గ్రామానికి చెందిన బోగిని చిన్న కేశవులు కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సంతాప సానుభూతిని తెలిపారు. మృతుల చిత్రపటాలకు పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సోనీ, స్థానిక సర్పంచులు నరసింహారావు, సావిత్రి, రోజా, మండల పార్టీ తాజా, మాజీ అధ్యక్షులు సతీష్ కుమార్, నరసింహారావు, రంగారావు, సీనియర్ నాయకులు సత్యనారాయణ, పాండురంగారావు, నరసింహారావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.