మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 19: మణుగూరు మున్సిపాలిటీలో జరగబోతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీలో ప్రతి వార్డులోని అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ ల వంటి నిర్మాణాలతో అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మణుగూరు మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
