మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 19: సింగరేణి సంస్థ భూనిర్వాసితులమైన మల్లేపల్లి ఎక్కడిగూడెం పద్మ గూడెం నిర్వాసితులకు ఉద్యోగ అవకాశ కల్పించాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు మా గ్రామంలో సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారని, ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు. బి టి పి ఎస్, భారజల కర్మాగారం, బిపిఎల్, జెన్కో సంస్థలలో ఉద్యోగ కల్పన సామాజిక న్యాయంగా జరిగిందని, మల్లేపల్లి, ఎగ్గడిగూడెం, పద్మ గూడెం సింగరేణి భూసేకరణలో మాత్రం అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా మా యందు దయ ఉంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
