UPDATES  

 పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోని కాంప్లెక్స్ ను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు…

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 19: అశ్వాపురం మండలం మొండికుంట పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోని కాంప్లెక్స్ ను శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు మేల్కొని బయటికి వచ్చేసరికి పరారయ్యారు. ఈ సంఘటనతో మొండికుంట గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పంచాయతీ సర్పంచ్ కు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు మొండి కుంట గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పంచాయతీ పాలకవర్గానికి తెలియకుండా మిషన్లో సహాయంతో గ్రామం నడిబొడ్డున ఉన్న పాత కార్యాలయం కూల్చాల్సిన అవసరం ఎవరుకుంటుందని గ్రామస్తులు పోతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !