UPDATES  

 విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సి ని వెంటనే ప్రకటించాలి: తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జే ఏ సి

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 21
మణుగూరు మండల పరిధిలోని లోని బిటిపిఎస్ లో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు అధ్వర్యంలో విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పిఆర్ సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దశల వారి ఆందోళనలో భాగంగా మొదటి రోజు మణుగూరులోని బీటీపీఎస్ లో మంగళవారం సమావేశం జరిగింది అన్నారు.ఈ సమావేశంలో జేఏసీ బీటీపీఎస్ రీజియన్ చైర్మన్ వి. ప్రసాద్, పవర్ ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవితేజ పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఆర్ సి పదకొండు నెలలు జాప్యమవుతున్న నేపథ్యంలో యాజమాన్యం పిఆర్ సి ప్రకటించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే దశల వారి ఆందోళనలకు వెళ్తున్నామని తెలిపారు.ఆందోళన కార్యక్రమాలు వచ్చే నెల 24 వరకు కొనసాగుతాయని పేర్కోన్నారు.ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24,25,27,28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు.మార్చి 1 నుంచి 4 వరకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కర్మాగారంలో ధర్నాలు ఉంటాయని వివరించారు. మార్చి 8 నుంచి 23 వరకు రిలే నిరాహార దీక్షలు అనంతర 24న హైదరాబాదులో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్నకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అసోసియేషన్ నాయకులు రాజాబాబు,కార్మిక సంఘం-1104 అధ్యక్షులు హేమ్లా నాయక్,అధ్యక్షులు వీరస్వామి,బీసీ సంఘం అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు నరేష్,సాయి, కార్మిక సంఘ నాయకులు సత్యనారాయణ,అనిల్,శివ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !