- రేగన్న అభయ
- పినపాక మండలంలో ఎమ్మెల్యే రేగా విస్తృత పర్యట
- పలువురిని పరామర్శించిన రేగా
- బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన వారికి పార్టీ అండగా నిలుస్తుంది.
మన్యం న్యూస్, పినపాక, మార్చి 05
మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం పర్యటించారు . పలువురిని పరామర్శించడం జరిగింది. జానంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గైకోటి వెంకన్న అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేపించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి యోగి క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాండురంగాపురం గ్రామానికి చెందిన యాలం సుశీల ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జానంపేట గ్రామానికి చెందిన గాండ్ల పవన్ ఇటీవల మరణించడంతో వారి నివాసానికి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దుగినేపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త భానోత్ వెంకన్న కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో పార్టీ తరపున మంజూరైన రెండు లక్షల రూపాయల విలువగల చెక్కును వారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ ఇన్సూరెన్స్ చేసి రెండు లక్షల ప్రమాద బీమా అందజేస్తుందని, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ను పార్టీ అధిష్టానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలియజేశారు. మల్లారం గ్రామంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య మనవడు శాఖమూడి అఖిల్ సాయి వివాహ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.