మన్యం న్యూస్. ములకలపల్లి. మార్చి 09. బి ఎస్ పి మండల అధ్యక్షుడు సాధం శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో, బి ఎస్ పి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర గురువారం ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు.అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ను ప్రజల్లోకి తీసుకెళ్లి, అన్ని పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు వేసి,గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. మన పార్టీ మహనీయుల త్యాగాలను, మరి ముఖ్యంగా బి ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్యాగం, ఆయన పని విధానంలో, నాయకత్వంలో మన అందరం పని చేసి మన జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో బూత్ కమిటీలు వేసి,ఎలక్షన్ కి సిద్ధంగా ఉండాలని తెలియజేయజేశారు.ముఖ్యంగా మన అశ్వారావుపేట నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంలో మనందరం కలిసి పనిచేసి బహుజన్ సమాజ్ పార్టీ ని గెలిపిద్దాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవి, జిల్లా ట్రెజరర్ దామోదర్,జిల్లా ఇ .సి మెంబర్ ఇల్లెందుల శేషావతారం,అశ్వారావుపేట నియోజకవర్గ కమిటీ, అన్ని మండలాల కమిటీలు తదితరులు పాల్గొన్నారు.