మన్యం న్యూస్, మంగపేట, మార్చి 11
మంగపేట మండలం వాగ్గొడుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోగల లక్ష్మీ నర్సాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా జరిగిన శ్రీనాగులమ్మ మహా జాతర శ్రీ నాగులమ్మ , సడాలమ్మ అమ్మవార్ల వనప్రవేశంతో శనివారం జాతర ముగిసింది. పూజారులు వడ్డెలు ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి, సడాలమ్మ అమ్మవారికి రహస్య పూజలు జరిపి, శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండొర్రె గుట్ట కు ప్రధాన పూజారులు బాడిశ రామకృష్ణ స్వామి,నాగ రమేష్ డోలు వాయిద్యాల నడుమ సాగనంపగా, సడాలమ్మ అమ్మవారిని సడాలమ్మ పూజారులు, వడ్డెలు పూజలు జరిపి యెర్రట్టల గుట్ట కు సాగనంపారు. వడ్డెలు, పూజారులు పంటలు బాగా పండాలని ,ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, ప్రజలు ఎలాంటి మహమ్మారి వ్యాధుల భారిన పడకుండా, అందరికీ మంచి జరగాలని వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు చేసి సాగానంపారు.శ్రీ నాగులమ్మ జాతర ఆద్యంతం భక్తులు భక్తి పార వశ్యంలో మునిగి తేలారు. భక్తులు ఆధ్యాత్మిక చింతన తో పాటు వినోద కార్యక్రమాలు ఇసుక వేస్తే రాలని జనం హాజరయ్యారు. ఈ సారి ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర విప్ రేగా కాంతారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద, బీజేపీ రాష్ట్ర నాయకులు తాటి కృష్ణ, బీఎస్పీ నాయకులు, పలు సంఘాల నాయకులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఎటువంటి ఆపశ్రుతి లేకుండ జరగటానికి సహకరించిన ప్రభుత్వ అధికారులు, పోలీస్ వారు, వైద్య సిబ్బంది, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, గ్రామ యువత, పెద్దలు ప్రతి ఒక్కరికి ఆ మహా తల్లి కృప, కటాక్షం లభించాలని శ్రీ నాగులమ్మ ఆలయ ఉపాసకులు బాడిశా రామకృష్ణ స్వామీజీ కోరారు.