మన్యం న్యూస్ ఏటూరునాగారం, మార్చి 15
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా బుధవారం ప్రారంభమయ్యాయి.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 298 మంది పరీక్షలు రాయవలసి ఉండగా 257 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.41 మంది విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారు.అలాగే వోకేషనల్ గ్రూపుకు చెందిన 64 మంది విద్యార్థులకు గాను 61 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు.03 విద్యార్థులు గైరాజరైనారు.రెండో సెంటర్ అయిన తెలంగాణ గురుకుల బాలికల కళాశాలలో 134 మంది విద్యార్థులకు గాను 123 మంది విద్యార్థులు హాజరైనారు.11 మంది విద్యార్థులు గైరాజరైనారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రానికి అనుమతించారు.ఏటూరు నాగారం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఈ సెంటర్ల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బంద్ పకడ్బందీగా ఏర్పాటు చేశారు.