UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 తెలంగాణ పోరుగడ్డపై బిజెపి ఆటలు సాగనివ్వం… -సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరీ నాగేశ్వరరావు…

మన్యం న్యూస్, మణుగూరు, మార్చి18: తెలంగాణ పోరుగడ్డపై బిజెపి ఆటలు సాగనివ్వమని, జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరీ నాగేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జన చైతన్య యాత్ర గోడప్రతిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలన్నారు. సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్త ఉద్యమం కొనసాగుతుందన్నారు. సిపిఎం అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జన చైతన్య యాత్ర కొనసాగుతుందన్నారు. యాత్రలో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. యాత్రలో మణుగూరు నుండి అధిక సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా సిపిఎం పార్టీ శ్రేణులు పాల్గొంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు లెనిన్ బాబు, టీవీ ఎం.వి ప్రసాద్, ఉప్పతల నరసింహారావు, బొల్లం రాజు, మాచవరం లక్ష్మణరావు, గుర్రం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !