మన్యం న్యూస్,ఇల్లందు రూరల్ మార్చి 18:ఇల్లందు మండలంలోని కోటిలింగాల క్రాస్ రోడ్డు వద్ద శనివారం సేవాలాల్ మహారాజ్ ఆలయ ఆవరణంలో జగదాంబదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్య అతిధిగా హాజరై విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. విగ్రహ ప్రతిష్టకు పూనుకున్న ఆలయ కమిటీసభ్యులకు హరిప్రియ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లాల్ సింగ్, ప్రేమ్ చంద్, రవి నాయక్, మాంజా, కృష్ణ, సునీల్, పాప, హ్యుసన్, సునేశు నాయక్, ధర్మ నాయక్, మంగీలాల్,రామచందర్, రాంబాబు,సతీష్, వీరన్న, తులసీరామ్,దాల్ సింగ్, అయ్యగారు నాగభూషణ్ శర్మ బృందం తదితరులు పాల్గొన్నారు.