UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 మణుగూరు సింగరేణి ఏరియా లో ఘనంగా రక్షణ వారోత్సవాలు…

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, మార్చి 18

మణుగూరు సింగరేణి ఏరియా లో రక్షణ వారోత్సవాలు – 2023 ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు సివిల్ డిపార్ట్మెంట్ విభాగంలో ఈ రక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.రక్షణ వారోత్సవాల్లో భాగంగా భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమ ముఖ్య కన్వెనర్ గా ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి శ్రీనివాస రావు,ఇల్లందు సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఏజి ‌ఎంఈ&ఎం కమలాకర్ భూషణ్,ఏజిన‌ఎం ఎం.గిరిధర రావు,ఎస్‌ఈ సివిల్ డా.డి ఆదినారాయణ,సుపర్వైసర్ సివిల్ ఏ సుధీర్ ఆధ్వర్యంలో ఈ రక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.సేఫ్టీ కమిటీ సభ్యులు మణుగూరు ఏరియాలో నిర్వహిస్తున్న సివిల్ పనులను,వారు పాటిస్తున్న రక్షణ చర్యలను తనిఖీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమ ముఖ్య కన్వెనర్ ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీనివాస రావు మాట్లాడుతూ,ఉద్యోగులు,కార్మికులను పని చేసే సమయంలో రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. రక్షణ వారోత్సవాల్లో భాగంగా మణుగూరు ఏరియాలో వివిధ ప్రదేశాల్లో సివిల్ పనులు నిర్వహించే అవుట్ సోర్సింగ్ కార్మికులకు అవగాహన కల్పించారు.రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ ఆవగాహనతో ఉండాలని,ప్రమాదాలకు గురి కాకుండా పనులు చేయాలని సూచించారు.తప్పనిసరిగా హెల్మెట్,బూట్లు,రక్షణ బెల్టు ధరించాలన్నారు.సివిల్ విభాగంలో పని చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు,కాంట్రాక్ట్ కార్మికులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి మొదటి రెండు స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.అనంతరం ఏజియ‌ఎం సివిల్ డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,భద్రత ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని,వాటిని అమలు చేసేలా,అవగాహన పెంచేలా, భద్రత అధికారులు,సంబంధిత శాఖ అధికారులు చూడాల్సిన అవసర ఎంతైనా ఉందని అన్నారు.సింగరేణిలో పని చేసే వారికి పటిష్ట భద్రత అవసరమని తెలిపారు. మెరుగైన ప్రమాణాలతో పరిశ్రమల ప్రగతి సాధిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎం‌వి‌టి‌సి మేనేజర్ నాగేశ్వర రావు,డి వై.ఎస్ ఈ సివిల్ రాజేంద్ర ప్రసాద్,ఈ‌ఈ సివిల్ ప్రవీణ్,సుపర్వైజర్ జే నవీన్, ఓవర్సీర్ సివిల్ అజయ్,శ్రవణ్, వి.రవి వర్మ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !