- మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .
- హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 20: అన్నపురెడ్డిపల్లి మండలనికి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని రాత్రి పూట వెలుగులు కనిపించనున్నయని స్థానిక ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి అన్నారు.మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రూ.5 కోట్లు రూపాయలను మంజూరు చేశారని అన్నారు.మండల అభివృద్ది పై దృష్టి సారించి నిరంతరం నిధులను కేటాయిస్తూన్న ఎమ్మెల్యే కూ ఎంపీటీసీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఈ సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు,మిఠాయిలు పంచి పెట్టారు.మండలానికి 5 కోట్లు రూపాయల వ్యయంతో నివేదికను ఈరోజు జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో ఏం ఎల్ సి తాతా మధు తో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిసెట్టి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అందజేసారు.దీంతో పనులకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఇటుకల హరి,ధారవత్ శివనాగరాజు,వెంకటకృష్ణచారి,నాగేశ్వరరావు,గ్రామస్థులు తది తరులు పాల్గోన్నారు.