UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు. .. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు…..

  • మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు.
  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.
  • రామనామ స్మరణతో మార్మోగిన పల్లెలు.
  • నవమి వేడుకలకు హాజరై న ప్రముఖులు.

మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 30, శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మండల వ్యాప్తంగా పల్లెల్లో సీతారామ కళ్యాణ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో చలువ పందిళ్ళ కింద మండపాలలో ఏర్పాటుచేసిన, సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఆలయ పూజారుల మంత్రోచ్ఛరణ, భక్తుల రామనామ స్మరణతో పల్లెలన్నీ మార్మోగాయి. పాపకొల్లు, జూలూరుపాడు గ్రామాలలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులతో కలిసి వీక్షించారు. వెంగన్నపాలెం, జూలూరుపాడు గ్రామాలలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పొంగులేటి అభ్యర్థి బానోత్ విజయబాయి, ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి పాల్గొని భక్తులతో కలసి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం విజయ బాయి వెంకటరెడ్డి తో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు, మహిళలు, చిన్నారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !