మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..ఇల్లందు పట్టణ మాజీ అధికార ప్రతినిధి పీవీ కృష్ణారావు తొలి, మలి ఉద్యమనాయకులు అయిన హరిగోపాలశర్మ బీఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామాను విరమించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తమకు పార్టీలో ఈమధ్య కాస్త ప్రాధాన్యం తగ్గినట్లుగా భావించి, మున్సిపల్ సార్వత్రిక ఎన్నికల్లో నేతల విజయానికి శాయశక్తులా కృషి చేసిన తమకు కాకుండా వలసవాదులకు పార్టీలో పదవులు కట్టబెట్టడం నచ్చకే రాజీనామా చేయదలచుకున్నామని తెలిపారు. కానీ తమ రాజీనామా అంశం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ దృష్టికి చేరడంతో ఆమె తమను పిలిచి తమకు న్యాయం చేస్తామని హమీనివ్వటంతో రాజీనామా ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో మరోమారు హరిప్రియ హరిసింగ్ నాయక్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.