తెలంగాణ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే..
కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ బీమా ద్వారా.. కల్లగీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోతే, ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం ప్రభుత్వం నుంచి అందుతుంది. నేరుగా వారి ఖాతాలోకే ఆ డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాల్సిందిగా రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం ఆదేశించారు.