నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ నేమ్ గా మారింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్, మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుంది.
ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక మందన్న తనకంటూ స్పెషల్ క్రేజ్ ని యూత్ లో సొంతం చేసుకుంది.