- కర్ణాటక లో కాంగ్రెస్ హవా: టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి
బిజెపి పాలనలో ప్రజలు విసిగిపోయారు - టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధి బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి లో గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయము ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అద్వర్యంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సమక్షంలో బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్త పరిచారు.,అనంతరం అందరూ కూడా స్వీట్స్ తీనిపించుకున్నరు,కార్యక్రమములో ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ బిజెపి కాలం చెల్లిందని ప్రజలు బిజెపి ప్రభుత్వం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత అవనితీ పాలనతో నరకయాతన అనుభవించారని ప్రజలు విసుగు చెందారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూశారని ఓటు తో తగ్గ గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ తో సామాన్య బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,ఇక పతనం మొదలైందనిఅన్నారు. బిజెపి కి,మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో రాబోవు ఏనికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వస్తుందని ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతం అవనితి పాలన నడుస్తుందని అన్నారు. ,కర్ణాటక మాదిరి తెలంగాణ రాష్ట్రంలో బి.అర్.యస్ పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెప్పుటకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని కే.సి.అర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుటకు కొన్ని రోజుల్లో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే శక్తి,అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తో సాధ్యమని అన్నారు
ఈ కార్యక్రమములో:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,లక్ష్మిదేవిపల్లి యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,నాయకులు ఆల్బర్ట్,కాంగ్రెస్ నాయకులు సుబ్బా రెడ్డి,సారంగా ఫణి,కలిపాక సత్యనారాయణ,నాగేశ్వరావు, మైనార్టీ మహిళ అధ్యక్షురాలు జరీనా,యూత్ నాయకులు శనగ లక్ష్మణ్,జక్కుల శ్రీనివాస్,వసంత్, గడ్డిగుట్ట నరేష్,బట్టు గణేష్ ,పెద్దమల్లు నాగేశ్వరావు,మైనార్టీ నాయకులు పకృద్దిన్,ఫైజుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.