UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 డయాలసిస్ కేంద్రాలు సిద్ధం అందుబాటులోకి డయాలసిస్ సేవలు

  • డయాలసిస్ కేంద్రాలు సిద్ధం
  • అందుబాటులోకి డయాలసిస్ సేవలు
  • జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

మణుగూరు,ఇల్లందులలో డయాలసిస్ కేంద్రాలు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మూడు డయాలసిస్ కేంద్రాలు మంజూరు కాగా అందులో రెండు కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఇల్లందులలో ప్రారంభించడానికి సిద్దం చేశామని అతి త్వరలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని కొత్తగూడెం ఆసుపత్రి నందు 5 మెషిన్లతో, ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం ఆసుపత్రి నందు 10 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. డయాలసిస్ రోగులకు ఈ రెండు కేంద్రాలు సరిపోక చాలా మంది వ్యాధిగ్రస్తులు వంతులు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, నిరీక్షించే వారని చెప్పారు. వ్యాధి గ్రస్థులకు సకాలంలో డయాలసిస్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అదనంగా మూడు నూతన డయాలసిస్ కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఇల్లందు, సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వారావుపేటలో ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ 50 లక్షల చొప్పున మొత్తం ఒక కోటి 50 లక్షలతో. మొత్తం మూడు నూతన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలతో వ్యాధి గ్రస్థులకు సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నూతన కేంద్రాలు ఏర్పాటు ద్వారా డయాలసిస్ రోగులు డయాలసిస్ కొరకు భద్రాచలం, కొత్తగూడెం ఆసుపత్రులకు సుదూరం ప్రయాణం చేయకుండా స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుతో వ్యాధి గ్రస్థులకు వ్యయ ప్రయాసల భారం తగ్గనున్నదని ఆయన చెప్పారు. ఈ నెల చివరి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వారావుపేట లో కూడా డయాలసిస్ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !