UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 డయాలసిస్ కేంద్రాలు సిద్ధం అందుబాటులోకి డయాలసిస్ సేవలు

  • డయాలసిస్ కేంద్రాలు సిద్ధం
  • అందుబాటులోకి డయాలసిస్ సేవలు
  • జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

మణుగూరు,ఇల్లందులలో డయాలసిస్ కేంద్రాలు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మూడు డయాలసిస్ కేంద్రాలు మంజూరు కాగా అందులో రెండు కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఇల్లందులలో ప్రారంభించడానికి సిద్దం చేశామని అతి త్వరలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని కొత్తగూడెం ఆసుపత్రి నందు 5 మెషిన్లతో, ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం ఆసుపత్రి నందు 10 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. డయాలసిస్ రోగులకు ఈ రెండు కేంద్రాలు సరిపోక చాలా మంది వ్యాధిగ్రస్తులు వంతులు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, నిరీక్షించే వారని చెప్పారు. వ్యాధి గ్రస్థులకు సకాలంలో డయాలసిస్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అదనంగా మూడు నూతన డయాలసిస్ కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఇల్లందు, సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వారావుపేటలో ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ 50 లక్షల చొప్పున మొత్తం ఒక కోటి 50 లక్షలతో. మొత్తం మూడు నూతన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలతో వ్యాధి గ్రస్థులకు సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నూతన కేంద్రాలు ఏర్పాటు ద్వారా డయాలసిస్ రోగులు డయాలసిస్ కొరకు భద్రాచలం, కొత్తగూడెం ఆసుపత్రులకు సుదూరం ప్రయాణం చేయకుండా స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుతో వ్యాధి గ్రస్థులకు వ్యయ ప్రయాసల భారం తగ్గనున్నదని ఆయన చెప్పారు. ఈ నెల చివరి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వారావుపేట లో కూడా డయాలసిస్ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !