UPDATES  

 ఐకేపీ వీవోఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరం అవుతాయనుకుంటే గ్రేడింగ్ విధానంతో కెసిఆర్ ప్రభుత్వం పని భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గ్రామాల్లోని మహిళలందరిని ముందుకు నడిపిస్తు వారికి బ్యాంకు ల నుండి లోన్ల రూపంలో అప్పులు ఇప్పించి వారికి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని ఆర్థికంగా సామజికంగా అభివృద్ధికి తొడ్పాడే వీవోఏలు నేడు తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిప్పుల కొలిమిని తలపించే ఎండల్లో నిరవధిక సమ్మెకు దిగడం బాధాకరమన్నారు. ఐకేపి విఓ ఏ మహిళా ఉద్యోగులు సమ్మెకు దిగి నెల దాటిన తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్చలకు పిలవకుండా ఉండటం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్ లను నెరవేర్చాలన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !