UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి.. మన్యం న్యూస్ కధనంతో కదలిన పోలీస్ యంత్రాంగం

  • గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి..
  • మన్యం న్యూస్ కధనంతో కదలిన పోలీస్ యంత్రాంగం
  • ఎన్నాళ్లకు గుణంబా రక్కసి పై గొడ్డలి పెట్టు
  • మన్యం న్యూస్ పత్రికకు రుణపడి ఉంటాం ..
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

గుడుంబా రాక్కసి కోరలు చిక్కుకున్న గ్రామాన్ని రక్షించేందుకు కంకణం బద్ధులై ఒకవైపు ప్రజలను చైతన్య పరుస్తూ మరోవైపు గుడుంబా నియంత్రణ పై మన్యం న్యూస్ దినపత్రిక ప్రతిరింపజేసిన ప్రత్యేక కథనంతో కదలిక మొదలైంది.. వెంకటాపురం మండలంలో ఇటీవల ప్రచూరించబడిన గుడుంబా విక్రయాలకు పోలీస్ శాఖ వారు స్పందించారు. మండలం లొ విక్రయాలకు పాల్పడుతున్న ఆయా గ్రామాలకు వెళ్లి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేశారు. వీరభద్రారం బెస్తగూడెం గ్రామాలలో సుమారు పదివేల లీటర్ల బెల్లం పానకాన్ని నల్లబెల్లాన్ని పట్టికను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబాకు సంబంధించిన డ్రమ్ములను ప్రజల ముందే ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ తిరుపతిరావు మాట్లాడుతూ గుడుంబా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని.ఎవరైనా గ్రామాలలో గుడుంబా కాస్తే వారి ఆచూకీ తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేశారు.. ఆలస్యం అయినా కూడా గుడుంబా స్థావరాల పై చేసిన మెరుపు దాడికి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోకముందే ఈ దాడులు జరిగి ఉంటే ఎంతో మంది ప్రాణాలు నిలబడేయని,అయినా సరే ఇంకా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకు ఈ మెరుపు దాడి ఊరటనిచ్చిందని మండల ప్రజలు తెలియజేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు గుడుంబా విక్రయ సమాచారాన్ని అధికారుల వద్దకు చేరవేసినందుకు మన్యం న్యూస్ పత్రిక ప్రతినిధులకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !