UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 బిజెపికి తిరుగులేదు: గోవా ఎమ్మెల్యే

బిజెపికి తిరుగులేదు: గోవా ఎమ్మెల్యే

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
బిజెపి పార్టీ క్రమశిక్షణతో ముందుకు పోతుందని ఆ పార్టీకి తిరుగులేదని గోవా రాష్ట్ర శాసనసభ్యులు సంకల్ప అమౌంకర్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విజయవంతంగా ముందుకు పోతున్నాయని తెలిపారు. బిజెపి పార్టీ ఏ ఒక్కరి కోసం పని చేయదని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. బిజెపి నుంచి ఎవరు వెళ్లిన పార్టీకి నష్టం లేదని అన్నారు. నరేంద్ర మోడీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను చూసి అనేకమంది బిజెపిలో చేరడం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు బిజెపి బలం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదన్నారు. ఈ దేశంలో 2024లో కూడా బిజెపి పార్టీ అఖండ విజయాలు సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కె.వి.రంగా కిరణ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరావు, జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్ రావు, నాయకులు ఎడ్లపల్లి శ్రీనివాస్, నరేంద్రబాబు, సీతారాం నాయక్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రవీందర్, మాలోత్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !