UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు¸

పొంతన లేని సమాధానాలతో పలు శాఖల అధికారులు గైర్హాజరు

సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ

మన్యం న్యూస్, పినపాక:

పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన మంగళవారం నాడు సర్వసభ్య సమావేశం జరిగింది. 11 గంటలకు హాజరు కావలసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో 18 శాఖలకు గాను, 7 శాఖల అధికారులు హాజరు కావడం జరిగింది. చరవాణి ద్వారా కారణాలను అడగగా పలువురు అధికారులు పొంతనలేని సమాధానాలు తెలిపారు. వృత్తిపరంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని ఎంపీపీ గుమ్మడి గాంధీ సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, వృత్తి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి సరైన సమయానికి హాజరుకాని మీరు, వృత్తి పట్ల ఎలా ఉన్నారో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకుని సమయపాలన పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వరరావు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !