UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 మైకు కిరికిరి.. వద్దిరాజు అసహనం…రాఘవపై గుర్రు..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకై ఆదివారం ఏర్పాటు చేసిన రోడ్ షోల మీటింగ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో జరిగిన కేటీఆర్ రోడ్ షో కొంత అసహనానికి గురిచేసిందని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ మైక్ కిరికిరి పెట్టింది. అంతేకాకుండా మైకు అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ ప్రక్కనున్న బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ(చిన్ని)లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా రెండు మూడు నిమిషాల తర్వాత మైకు అందుబాటులోకి రావడం అది కూడా మధ్య మధ్యలో ఆగుకుంటూ రావడంతో స్టేజి మీద ఉన్న వారికి రోడ్ షో కి హాజరైన ప్రజలకి కొంత కోపం తెప్పించింది. మైక్ సెట్ నాణ్యమైనదిగా ఏర్పాటు చేయకపోవడంతో వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవపై రాజ్యసభ సభ్యుడు కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ వద్దిరాజు రవిచంద్ర గరం అయినట్లు ప్రచారం జరగడం గమనార్హం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !