UPDATES  

 అభివృద్ధి ఎవరు చేశారో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం…

అభివృద్ధి ఎవరు చేశారో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం…
-నేను నిధులు తీసుకువస్తే ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు.
-సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారు.
-పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తొగ్గూడెం సమ్మక్క సారలమ్మఆలయం వద్ద జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎన్నికల ముందు నేను మంజూరు చేయించిన నిధులకు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా అన్ని గ్రామాల్లో తిరుగుదామని ఎవరు ఏమి అభివృద్ధి చేశారో తేల్చుకుందామని సవాల్ విసిరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !