UPDATES  

 సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి. పోడు సాగుదారులకు అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్.

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సాగులో ఉన్న పోడుభూములన్నింటికీ హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదో ఒక కారణంతో హక్కు పత్రాలు ఇవ్వకుండా పోడు సాగు దారులకు అన్యాయం చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు, బుధవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశం మచ్చ వెంకటేశ్వర్లు అద్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగిస్తూ జిల్లా లో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం కోసం సబ్ డివిజనల్ స్థాయి, జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ నిర్వహించారని ,ఆ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు, జిల్లా లో 82737మంది 2,94,890ఎకరాలకు దరఖాస్తు చేశారని, ముఖ్యమంత్రి హామీ ప్రకారం సమావేశాలలో ప్రతి పోడుసాగుదారుడికి న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు, కొత్త గా పోడు సాగు కు ఎవరూ ప్రోత్సహించరని కానీ ఇప్పటికే సాగులో ఉన్న వారికి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఎంపార్టీ ఆధ్వర్యంలో ప్రతిఘటన చేస్తామని అన్నారు, అదే విధంగా జిల్లా లో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు,ఏజే రమేష్,కె.పుల్లయ్య,ఎం.జ్యోతి,ఎంబి నర్సారెడ్డి,కె.బ్రహ్మచారి,కారం పుల్లయ్య,లిక్కి బాలరాజు,రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, ఎస్ ఏ నబి, దొడ్డ రవికుమార్,కొండబోయిన వెంకటేశ్వర్లు,వీర్ల రమేష్,బి.చిరంజీవి, గడ్డం స్వామి, చిలకమ్మ, ఎం, రేణుక,జి.పద్మ,సరియం కోటేశ్వరరావు, నిమ్మల వెంకన్న, పిట్టల అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !