UPDATES  

 కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయ్…

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 20: మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ఊట్లపల్లి సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయ్ సోమవారం ప్రారంభించారు. ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందని అన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ డాక్టర్ రాందాస్, హెచ్ఏఎం గోపాల్, ఎంఎల్హెచ్పి ఎస్కె రుష్కనా, మాదాస బాప్తలీక, అసిస్టెంట్ సుధారాణి, వార్డ్ నంబర్స్, ఆశా వర్కర్స్, పంచాయతీ సిబ్బంది, మహిళలు, గ్రామస్థలు

మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !